‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు పంకజ్ త్రిపాఠి తాజాగా తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్ల పాటు విరామం లేకుండా సినిమాలు, సిరీస్ల్లో నటించడంతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. EMIలు కట్టేందుకో లేదా కేవలం జీవనోపాధి కోసం నటించడం తనకు ఇష్టం లేదన్నారు. తనలోని నటుడిని సంతృప్తిపరిచే పాత్రలనే ఇకపై ఎంపిక చేసుకుంటానని చెప్పారు. పాత్రల ఎంపికలో నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఆలస్యంగా సినిమాలు చేయడంపై పంకజ్ త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు
Published on: 📅 10 Feb 2026, 06:29