ఇండియా–పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న జరగాల్సిన T20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్కు చివరికి గ్రీన్ సిగ్నల్ లభించింది. తొలుత బహిష్కరణ నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్, ICC, PCB మరియు బంగ్లాదేశ్ బోర్డుతో జరిగిన చర్చల అనంతరం యూటర్న్ తీసుకుంది. పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇచ్చింది. బంగ్లాదేశ్ అభ్యర్థన కూడా ఈ నిర్ణయంలో కీలకంగా మారింది. దీంతో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న హై వోల్టేజ్ మ్యాచ్ మరోసారి జరిగే అవకాశం ఖరారైంది.