on one side chandrababu on the other side lokesh a straight warning to the mlas

అటు చంద్ర‌బాబు.. ఇటు లోకేష్‌.. ఎమ్మెల్యేల‌కు స్ట్రైట్ వార్నింగ్!

7

Published on: 📅 31 Mar 2026, 08:48 AM
Reporter: 🖊

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇటీవలె ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికీ కూడా కొందరు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారికి తాజాగా అటు సీఎం చంద్రబాబుతో పాటు ఇటు మంత్రి నారా లోకేష్ స్ట్రైట్ మార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేస్తామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, కేంద్రం సహకారంతో మరో ఏడాదిన్నర కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Sponsored