తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసేలా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించి రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అధ్వయ కన్వెన్షన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. అదే రోజు పార్టీ పేరు, జెండాను కూడా ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు.
ఈ ప్రకటనను శ్రీరామనవమి రోజున చేయడం వెనుక కూడా ప్రత్యేక ఉద్దేశం ఉందని కవిత పేర్కొన్నారు. మంచి రోజు కాబట్టి ఈ రోజునే ప్రజలకు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. కొత్త పార్టీ స్థాపనకు తాను సిద్ధమవుతున్నానని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమ పార్టీ ఇతర పార్టీలతో భిన్నంగా ఉండబోతుందని కవిత చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా యువత, మహిళలకు తమ పార్టీలో మంచి స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు మగవాళ్లు ఏర్పాటు చేసిన పార్టీలను ప్రజలు చాలానే చూశారని, ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డగా తాను పార్టీ పెడితే ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారని వ్యాఖ్యానించారు. ఈ మాటలు మహిళా నాయకత్వం, కొత్త రాజకీయ దిశపై చర్చకు దారితీశాయి.
కవిత ఈ ప్రకటనతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలపై కూడా చర్చ మొదలైంది. ఆమె పార్టీ స్థాపన వెనుక లక్ష్యం ఏమిటి, ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకు రానుంది, ఎవరెవరికి ప్రాధాన్యం ఇవ్వనుంది వంటి అంశాలపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా మహిళలు, యువతను కేంద్రీకరించి పార్టీ నిర్మాణం ఉంటుందన్న సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏప్రిల్ 25న జరిగే సమావేశం ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది. ఆ రోజు పార్టీ పేరు, జెండాతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై కూడా కవిత స్పష్టత ఇవ్వే అవకాశముంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయ వేదికగా ఈ పార్టీ ఎదుగుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. అయితే ప్రస్తుతం ఆమె చేసిన ఈ ప్రకటన మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువత, మహిళలకు పెద్దపీట వేస్తామని ప్రకటించడం ద్వారా కొత్త రాజకీయ సందేశాన్ని ఇవ్వాలని కవిత ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన
6