పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ముఖ్యంగా సినిమాలో పవన్ ఎంట్రీ సీన్పై నెటిజన్లు ట్రోల్స్ చేయడం గమనార్హం. జీప్ నుంచి హీరో రెండుసార్లు దిగినట్లు ఒకే సన్నివేశంలో చూపించారంటూ కొందరు విమర్శలు చేశారు.
ఈ విమర్శలపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రెండు షాట్లు నచ్చడంతోనే అవి సినిమాలో ఉంచినట్లు తెలిపారు. మొదట పవన్ జీప్ నుంచి దిగే షాట్ను తానే తీశానని, మరో షాట్ను ఫైట్ మాస్టర్ తీసారని చెప్పారు. రెండూ బాగా వచ్చాయని భావించి వాటిని కలిపి చూపించామని పేర్కొన్నారు.
అలాగే, సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకోవడం సహజమని, ప్రతి విషయాన్నీ లాజిక్తో చూసే అవసరం లేదని హరీశ్ అన్నారు. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ప్రధాన లక్ష్యమని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక ‘ధురంధర్ 2’ సినిమా కలెక్షన్స్పై కూడా హరీశ్ శంకర్ స్పందించారు. ఆ సినిమా విజయం తనకు కూడా సంతోషాన్నిస్తోందని చెప్పారు. తాను ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో చూపించిన దేశభక్తి అంశాలను, ‘ధురంధర్ 2’లో దర్శకుడు ఆదిత్యధర్ పూర్తిస్థాయిలో చూపించారని ప్రశంసించారు. తన భావాలతో దగ్గరగా ఉన్న సినిమా సక్సెస్ అవడం ఆనందంగా ఉందన్నారు.
తన కెరీర్పై మాట్లాడిన హరీశ్ శంకర్, ఇప్పటివరకు తక్కువ సినిమాలే చేసినట్లు వెల్లడించారు. సుమారు పది ప్రాజెక్టులు వివిధ కారణాల వల్ల నిలిచిపోయాయని తెలిపారు. స్క్రిప్ట్ సెట్ కాకపోవడం, హీరోలు చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. ఎన్టీఆర్తో ‘ఎంఎల్ఏ’ ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేసినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదని గుర్తుచేశారు.
ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడతానని, ఇప్పటికే చాలా కథలు సిద్ధంగా ఉన్నాయని హరీశ్ తెలిపారు. వరుసగా సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ ఎంట్రీపై ట్రోల్స్… హరీశ్ శంకర్ కౌంటర్
6
Published on: 📅 26 Mar 2026, 03:00 PM
Reporter: 🖊 Venkat Bhanu