Chandrababu Teleconference With Tdp Leaders: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఎవరికీ అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలకు చేస్తున్న మంచి పనులను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందిస్తున్నామని, గత ప్రభుత్వం అర్హులకు నష్టం కలిగించేలా వ్యవహరించిందని విమర్శించారు. లోపాలను సరిదిద్ది అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు తమ్ముళ్లకు పండగే.. రెండు శుభవార్తలు.. సెప్టెంబర్ 6న ఫిక్స్, రెడీగా ఉండండి
Published on: 28-08-2025