తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తోంది. అందులో భాగంగా చిన్నారుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం, పిల్లలకు అవసరమైన వస్తువుల సరఫరాపై దృష్టి సారించారు
అంగన్వాడీ చిన్నారులకు గుడ్న్యూస్.. త్వరలోనే, మంత్రి కీలక ప్రకటన
Published on: 09-09-2025