తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం నిర్వహించే ప్రెస్మీట్లో 124 మంది ఆయుధాలతో సహా సరెండర్ కానున్నారు. కేంద్ర బలగాలు, పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్న మావో టాప్ కమాండర్ గణపతి వీరిలో ఉంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల సరెండర్ అయిన దేవ్జీతో పాటు కీలక నేతల గన్మెన్లు, అనుచరులు కూడా లొంగిపోనున్నట్లు సమాచారం.
>
>
>