యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశం దుబాయ్లో భయాందోళనలు నెలకొన్నాయి. మిస్సైళ్ల దాడులకు అవకాశం ఉందని ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇళ్లలోనే ఉండాలని, బయట ఉన్నవారు వెంటనే సమీపంలోని షెల్టర్లకు వెళ్లాలని ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్లు పంపుతోంది. మరోవైపు ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ కూడా దేశవ్యాప్తంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
దుబాయ్లో యుద్ధ భయం… ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్
Published on: 📅 06 Mar 2026, 04:58 PM
Reporter: 🖊 Suresh Reddy