కర్నూలు శివారులోని జగన్నాథగట్టు వద్ద నిర్మించిన టిడ్కో (TIDCO) గృహ సముదాయం గురించిన వార్త ఇది. కర్నూలు నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం సుమారు 10 వేల గృహాల నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మాణం చివరి దశలో ఉండగా వైసీపీ ప్రభుత్వం పక్కనపెట్టింది. ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ ఈ సముదాయాన్ని పరిశీలించారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర మౌలిక వసతులు కల్పించి ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
పది వేల కుటుంబాల కలల సముదాయం
1
Published on: 📅 31 Mar 2026, 11:30 AM
Reporter: 🖊