రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్ణకుంభం, వేదమంత్రాల మధ్య ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులను సీఎం ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో ఏడు ఫ్లోర్లలో (G+7) సీఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. ఇందులోనే రాష్ట్రీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం పక్కన మొత్తం 8 ఎకరాల్లో 4 భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సీఆర్డీఏ భవనంలోని మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు, గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు.
అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Published on: 📅 31 Mar 2026, 11:10 AM
Reporter: 🖊