హైదరాబాద్లో గ్రీన్ స్పేస్లు తగ్గుతున్న వేళ, హైడ్రా తీసుకున్న చర్యలు ప్రశంసనీయంగా మారాయి. మాధవ హిల్స్ ఫేజ్–2లో అనధికారికంగా ఆక్రమించబడిన రూ.11.50 కోట్ల విలువైన పార్కు భూమిని అధికారులు కూల్చివేసి ప్రజల కోసం తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చర్య భవిష్యత్ తరాల కోసం ప్రదేశాన్ని సంరక్షించినట్టేనని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.