హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ (GHMC), పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ' స్పెషల్ డ్రైవ్' పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా.. రోడ్డు మీద చెత్త వేస్తే చట్టంలోని సెక్షన్ల ప్రకారం 8 రోజుల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.