TTD Warns Devotees On Legal Action: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద రాజకీయ ప్రసంగాలు, నిబంధనలకు విరుద్ధంగా రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. భక్తులు టీటీడీ నియమాలను పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని తెలిపింది. మరోవైపు, టీటీడీ ఈవో శ్యామలరావు ధార్మిక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, అన్నమయ్య కీర్తనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. తిరుమలలో వ్యర్థాల నిర్వహణ, బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటును మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
తిరుమలలో భక్తులు అలా చేయొద్దు.. కేసు పెడతారు జాగ్రత్త.. శ్రీవారి ఆలయం దగ్గర మైకుల ద్వారా ప్రచారం
Published on: 30-08-2025