తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్య శాఖ అప్రమత్తమైంది. రానున్న రెండు మూడు రోజుల్లో జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున.. నీటిని శుద్ధి చేసి తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 108కి ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.
భారీ వర్షాలు, పెరుగుతున్న కేసులు.. తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక సూచనలు
Published on: 28-08-2025