Guntur NTR Statue In Lord Krishna Controversy: గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వివాదానికి దారితీసింది. యాదవ సంఘాలు, హిందూ పరిషత్ నేత కరాటే కళ్యాణి తదితరులు విగ్రహాన్ని వ్యతిరేకించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మనోభావాలు దెబ్బతినకుండా విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించారు. దీంతో వివాదం సద్దుమనిగిందని స్థానిక టీడీపీ నేతలు తెలిపారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన టీడీపీ నేతలు.. రామచంద్ర యాదవ్, కరాటే కళ్యాణీ ఎంట్రీతో
Published on: 25-08-2025