ఏపీలో మరో నేషనల్ హైవేకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. కడప జిల్లా బద్వేల్ నుంచి నెల్లూరు వరకు ఉన్న నేషనల్ హైవే 67ను నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో తెలిపారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కడప జిల్లా గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలో నేషనల్ హైవే16లో గురువిందపూడి వరకు ఈ రహదారిని అభివృద్ధి చేస్తారు. దీనికి బీఓటీ పద్ధతిని ఉపయోగిస్తారు.
ఏపీలో కొత్తగా నేషనల్ హైవే.. ఆ రూట్లో రూ.3653 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఆ జిల్లాల దశ తిరిగినట్లే
Published on: 23-08-2025