రైతు

రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు? కొత్త వాళ్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

Published on: 12-08-2025

Rythu Bharosa Scheme | రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు, తద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 పంట పెట్టుబడి సాయం (రెండు విడతల్లో) వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఎన్ని ఎకరాల భూమి ఉంటే, అన్ని ఎకరాలకు రైతు భరోసా అందిస్తోంది. భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన పట్టాదారు రైతులు ఈ పథకానికి అర్హులు. ​ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసా పథకానికి అర్హులు. కొత్త వాళ్లు రైతు భరోసా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలేమిటి? వివరాలు..

Sponsored