కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో సంచలన ఘటన వెలుగుచూసింది. జ్యోతిష్కుడి మాటలు నమ్మిన 33 ఏళ్ల సుచిత్ర తన తల్లి పుష్పావతిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన తండ్రి మరణానికి తల్లే బ్లాక్ మ్యాజిక్ చేసిందని జ్యోతిష్కుడు చెప్పడంతో ఆమె తీవ్ర అనుమానాలకు లోనైంది. అనంతరం ఇంటికి వెళ్లి నిద్రలో ఉన్న తల్లిని దిండుతో ఉక్కిరిబిక్కిరి చేసి చంపినట్లు సమాచారం. తర్వాత సహజ మరణంలా చూపించేందుకు ప్రయత్నించింది. గ్రామస్తుల అనుమానంతో పోలీసులకు సమాచారం అందగా, అంత్యక్రియల ముందు కేసు బయటపడింది. క్యత్సంద్ర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.