కాన్పూర్లో జరిగిన లాంబోర్గినీ కారు ప్రమాదం కేసులో అరెస్టైన పొగాకు వ్యాపారి కుమారుడు శివమ్ మిశ్రాకు మంగళవారం మధ్యాహ్నం బెయిల్ లభించింది. ఉదయం అరెస్టైన కొన్ని గంటలకే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రూ.10 కోట్ల విలువైన లగ్జరీ కారు ఆటోరిక్షా, మోటార్సైకిల్ను ఢీకొట్టి స్తంభాన్ని ఢీకొనగా ఒకరు గాయపడ్డారు. ప్రమాదం సమయంలో శివమ్ డ్రైవింగ్ సీటులో ఉన్నట్లు వీడియోలు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నప్పటికీ, తన క్లయింట్ కారు నడపలేదని న్యాయవాది వాదించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.