T20 వరల్డ్కప్లో పాకిస్థాన్ భారత్తో ఆడేందుకు అంగీకరించడంతో ICCకి ఎదురయ్యే భారీ ఆర్థిక నష్టం తప్పినట్లైంది. ఈ హైప్రొఫైల్ మ్యాచ్ లేకపోతే సుమారు 180 మిలియన్ డాలర్లు (రూ.1,600 కోట్లకు పైగా) నష్టం వాటిల్లేదని నివేదికలు చెబుతున్నాయి. టోర్నమెంట్ మొత్తం ఆదాయంలో దాదాపు 20 శాతం ఈ ఒక్క మ్యాచ్ నుంచే వచ్చే అవకాశం ఉంది. అయితే, మాజీ నీయో స్పోర్ట్స్ యజమాని హరీష్ థవాని, ఒకే మ్యాచ్పై బ్రాడ్కాస్టర్ విలువ ఆధారపడదని భిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.