హైదరాబాద్లో నివాస స్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి TGRSCL శుభవార్త చెప్పింది. తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మల్గూడ ప్రాంతాల్లోని 137 బహిరంగ ప్లాట్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వేలం ఫిబ్రవరి 7, 8న జరగనుంది. గజం ధర రూ.20,000 నుంచి రూ.30,000గా నిర్ణయించారు. మార్కెట్ రేట్లతో పోలిస్తే ఇది తక్కువ ధర కావడంతో దరఖాస్తుదారుల్లో ఆసక్తి భారీగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ అవకాశం అరుదైనదిగా భావిస్తున్నారు నగరవాసులు వెంటనే అంటున్నారు.