విశాఖ తీరం నుంచి మరోసారి మిస్సైల్ టెస్ట్కు రక్షణ శాఖ సిద్ధమవుతోంది. నోటమ్ (నోటీసు టు ఎయిర్మెన్) ఈ నెల 12 అర్ధరాత్రి 12 నుంచి 13 ఉదయం 9 వరకు జారీ చేశారు. ఈ సమయంలో తీరం 500 కిలోమీటర్ల పరిధిలో విమాన రాకపోకలకు నిషేధం ఉంటుంది. గత డిసెంబర్ 24న ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి K-4 బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా ప్రయోగించబడింది.