సంక్రాంతి సెలవుల్లో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్–విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్ల వద్ద రిపేర్ల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో విజయవాడ చేరడానికి 8 గంటలు పడుతోంది. పరిస్థితిని తగ్గించేందుకు నార్కట్పల్లి మార్గంగా ట్రాఫిక్ మళ్లించేందుకు అధికారులు యోచిస్తున్నారు.