రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ఈ బస్సు, రెడ్డిగూడెం వద్ద రోడ్డు విస్తరణ పనుల కోసం ఏర్పాటు చేసిన పైపులకు తగిలింది. దాంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.