తిరుపతి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ (Pawan kalyan) పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పవన్ అటవీ అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు.ఆ సమీక్షలో అటవీ సంరక్షణ చర్యలు, ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. అధికారులకు తగు సూచనలు చేస్తూ, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడం, అడవుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన పవన్
2
Published on: 📅 31 Mar 2026, 02:06 PM
Reporter: 🖊