రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. టిప్పర్ రాంగ్రూట్లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు. బస్సు కంకర లోడుతో వస్తున్న లారీని ఢీకొట్టి, కంకర లోడు కింద పడిపోవడంతో 20 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.