అప్రమత్తంగా

అప్రమత్తంగా ఉండండి

Published on: 30-10-2025

తుపాను ప్రభావం ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరి కోతల సమయం కావడం వలన పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.

Sponsored