మేడారం జాతర సందర్భంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీనికి బదులుగా ఫిబ్రవరి 14ను (రెండో శనివారం) పనిదినంగా పరిగణించనున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు జాతరకు వెళ్లనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కాగా మేడారం జాతర రేపటితో ముగియనుంది.