ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు తమ జట్టుపై ఎలాంటి ప్రభావం చూపవని UAE కెప్టెన్ మహ్మద్ వసీం స్పష్టం చేశారు. తమ జట్టులో భిన్న దేశాల ఆటగాళ్లు ఉన్నప్పటికీ, అందరం ఒక కుటుంబంలా ఉంటామని చెప్పారు. జాతీయత కంటే జట్టు ఐక్యతే తమ బలమని పేర్కొన్నారు. భారత హెడ్ కోచ్ లాల్చంద్ రాజ్పుత్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. న్యూజిలాండ్తో మ్యాచ్కు UAE పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైందని వసీం అన్నారు.
ఇండియా–పాక్ వివాదం మాకు సంబంధం లేదు: UAE కెప్టెన్ మహ్మద్ వసీం
Published on: 📅 10 Feb 2026, 06:12