‘పుష్ప’లో అల్లు అర్జున్కు జోడీగా నటించిన రష్మిక ఇప్పుడు సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న AA22లో ఆమె నెగటివ్ రోల్లో నటిస్తారని చర్చ జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం రష్మిక ‘మైసా’, ‘రణబాలి’ చిత్రాల్లో నటిస్తున్నారు.