ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరనుంది. మామిడి రైతులకి సబ్సిడీ డబ్బులు త్వరలో అందుతాయని.. ఈ నెల 20 నుంచి 25 తేదీల మధ్య రూ.160 కోట్ల సబ్సిడీని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మొత్తం 37 వేల మంది రైతులకి ఈ సబ్సిడీ అందుతుందని.. ఈ సీజన్లో 4.10 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కాయలను కొనుగోలు చేశామన్నారు. గుజ్జు పరిశ్రమల తరపున 2.35 టన్నులు, ర్యాంపుల తరపున 1.65 టన్నుల కాయలు కొనుగోలు చేశారన్నారు.