టాలీవుడ్ ప్రముఖ గాయకుడు, ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారారు. చెన్నై సాలిగ్రామంలోని తన ఫ్లాట్లో అద్దెకు ఉంటున్న సహాయ దర్శకుడు తిరుజ్ఞానం, గత 25 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో కేకేనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలకు రూ.40,500 ఇవ్వాలని ఒప్పుకుని, అడ్వాన్స్గా రూ.1.50 లక్షలు ఇచ్చినప్పటికీ తర్వాత నుంచి డబ్బులు ఇవ్వకపోగా తనను బెదిరించాడని చరణ్ ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
25 నెలలుగా అద్దె చెల్లించని అసిస్టెంట్ డైరెక్టర్.. పోలీసులకు ఎస్పీ చరణ్ ఫిర్యాదు
Published on: 08-09-2025