AP Free Gas Cylinder Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త తెలిపింది. దీపం-2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను అందించాలని నిర్ణయించింది. దీని ద్వారా 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.5.54 కోట్లు ఖర్చు చేయనుంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనుంది. లబ్ధిదారులు ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలతో రాయితీ పొందవచ్చు.
ఏపీలో ఇకపై వారికి కూడా ఉచితంగా సిలిండర్లు ఇస్తారు.. 23,912మందికి లబ్ధి
Published on: 📅 31 Mar 2026, 08:39 AM
Reporter: 🖊