ఆనంద్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి కమలినీ ముఖర్జీ, ‘గోదావరి’, ‘గమ్యం’ వంటి సినిమాలతో కూడా విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే, గత దశాబ్దంగా టాలీవుడ్కి దూరంగా ఉన్న ఆమె ఈ గ్యాప్కి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను చేసిన ఒక సినిమాలోని పాత్ర, తాను ఊహించిన విధంగా తెరపై రాలేదని, ఆ పాత్ర తనకు అసంతృప్తిని కలిగించిందని తెలిపారు. ఆ కారణంగా తెలుగు సినిమాల నుండి దూరమయ్యానని చెప్పారు.