ఉత్తరప్రదేశ్లోని బదౌనీ జిల్లాలో చెరువు తవ్వుతుండగా ఆరు అడుగుల లోతులో అరుదైన పంచముఖ శివలింగం బయటపడింది. పర్యావరణ ఉద్యమకారిణి శిప్రా పాఠక్ పొలంలో ఈ శివలింగం వెలుగుచూడటం విశేషం. ఇది భగవంతుడి అనుగ్రహమని ఆమె పేర్కొన్నారు. శివలింగం మూడు శతాబ్దాల కిందటిదని ఆలయ పూజారి అభిప్రాయపడ్డారు. పురావస్తుశాఖకు సమాచారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. శివలింగం బయటపడిన వార్తతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలిరావడంతో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
జేసీబీతో చెరువులో తవ్వుతుండగా.. ఆరు అడుగుల లోతులో అద్భుతం.. దైవ అనుగ్రహం కాకపోతే ఇంకేంటి?
Published on: 23-07-2025