ఎన్‌సీఈఆర్‌టీ

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో డిజిటల్ ప్రచారానికి బ్రేక్

Published on: 📅 27 Feb 2026, 06:33 AM
Reporter: 🖊

ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర విషయాలు ఉన్నాయనే వివాదం తీవ్రరూపం దాల్చింది. దీనిపై విచారణ చేసిన భారత సుప్రీంకోర్టు పుస్తక ముద్రణ, పునర్ముద్రణతో పాటు డిజిటల్ ప్రచారంపైనా సంపూర్ణ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖలు, ఎలక్ట్రానిక్ వేదికలకు లేఖ రాసి ఆ పుస్తక ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా NCERT అభ్యంతరకర అంశాలపై క్షమాపణ తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రేంద్రప్రధాన్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Sponsored