Bill Gates అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో RTGS (Real Time Governance System) సెంటర్ను సోమవారం సందర్శించారు. పాలనలో ఆధునిక సాంకేతికత వినియోగం, పౌరులకు సేవల అందజేతలో డిజిటల్ విధానాల అమలు ఆయనను ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, వేగంగా ప్రజలకు అందించే విధానాన్ని ప్రశంసిస్తూ, సాంకేతికత ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా మార్చుకోవచ్చని గేట్స్ పేర్కొన్నారు. ఈ సందర్శన రాష్ట్ర డిజిటల్ పరిపాలనకు గుర్తింపుగా నిలిచింది.