T20 వరల్డ్కప్లో ఇవాళ కొలంబో వేదికగా జరిగే ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్కు ముందు ప్రత్యేక మ్యూజికల్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ‘ధురంధర్’ సినిమా పాటలను ప్లే చేయడంతో పాటు ర్యాపర్ హనుమాన్కైండ్ ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నారు. పాకిస్థాన్, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్ సందర్భంగా ఆ పాటలు వినిపించనుండటం ఆసక్తికరంగా మారింది. PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ సహా పాక్ జట్టు కూడా ఈ ప్రోగ్రామ్ను వీక్షించనుంది.