విద్యుత్ శాఖలో ఏఈ స్థాయి ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం మోపిందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా, ఎన్నికల లోపు తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.