తిరుపతి జిల్లాలోని MP-SEZలో వెబ్సోల్ సంస్థ రూ.3,538 కోట్ల పెట్టుబడితో 8GW సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయనుంది. రెండు దశల్లో 120 ఎకరాల్లో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టులో 4GW సోలార్ సెల్స్, 4GW సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉంటాయి. దీని ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. అవసరమైన విద్యుత్ కోసం 300 ఎకరాల్లో 100MW క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.