you can visit 3 holy places for rs 660 rtc bumper offer

రూ.660కే 3 పుణ్యక్షేత్రాలను చూసి రావొచ్చు.. ఆర్‌టీసీ బంపర్ ఆఫర్!

Published on: 📅 31 Mar 2026, 01:31 PM
Reporter: 🖊

శ్రావణ మాసం శివ కేశవులకు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం అయినప్పటికీ, శివాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అయితే హనుమాన్ దర్శన్ కు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కల్పిస్తోంది శ్రీ సత్య సాయి జిల్లా ఏపీఎస్ఆర్టీసీ. డిపోల నుండి శ్రావణ మాసం పురస్కరించుకొని ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రాలైన మురిడి, నేమకల్లు, కసాపురం లకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి మధుసూదన్ తెలిపారు.

Sponsored