జేఎన్‌యూ

జేఎన్‌యూ క్యాంపస్‌లో ఉద్రిక్తత… విద్యార్థి ర్యాలీ హింసాత్మకంగా మారింది

Published on: 📅 23 Feb 2026, 11:46

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమానత్వ ర్యాలీగా ప్రారంభమైన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఉపకులపతి శాంతిశ్రీ ధులిపూడి పండిట్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘం రాజీనామా డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయ ఆస్తుల ధ్వంసం కేసులో నలుగురు ప్రతినిధుల సస్పెన్షన్ రద్దు చేయాలని కూడా కోరింది. పరిపాలన స్పందించలేదని, మరో విద్యార్థి సంఘం సభ్యులు దాడికి దిగారని ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు మాత్రం ఆరోపణలను ఖండిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.

Sponsored