ఆల్ ఇండియా సర్వీసెస్ 2026 నోటిఫికేషన్లో UPSC పలు కీలక మార్పులు చేసింది. ఇకపై అప్లికేషన్ సమయంలో పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు లైవ్ ఫొటోను కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఫొటోలు సరిపోలకపోతే దరఖాస్తును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. అలాగే వైట్ పేపర్పై బ్లాక్ ఇంక్ పెన్తో మూడుసార్లు సంతకం చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, పరీక్షా ప్రక్రియల్లో పారదర్శకత పెంచేందుకే ఈ మార్పులు చేసినట్లు UPSC తెలిపింది.