మధ్యప్రాచ్యాన్ని ఉద్రిక్త పరిస్థితుల్లోకి నెట్టిన అమెరికా–ఇరాన్ పోరుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ యుద్ధాన్ని జీసస్, అల్లా మధ్య జరిగే పోరుగా వ్యాఖ్యానించిన ఆయన, ఎవరు గెలిస్తే వారి మతంలోకి మారుతానని ట్వీట్ చేసినట్లు సమాచారం. అమెరికాలో క్రైస్తవులు మెజార్టీగా ఉండటం, ఇరాన్ ఇస్లామిక్ దేశం కావడం వల్ల ఇది రెండు మత సిద్ధాంతాల మధ్య పోరుగా భావించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. వర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి
అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
Published on: 📅 04 Mar 2026, 05:04 AM
Reporter: 🖊 Ramesh Kumar
>
>
>