అజేయంగా

అజేయంగా సూపర్ 8లో భారత్… అభిషేక్ ఫామ్ ఆందోళనకరం

Published on: 📅 21 Feb 2026, 07:49

టి20 వరల్డ్ కప్ 2026లో టీమ్ ఇండియా అజేయంగా సూపర్ 8కు చేరింది. నెదర్లాండ్స్‌పై గెలిచి తదుపరి దశలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌ను ఎదుర్కొననుంది. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డక్ అవ్వడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ముందు సంజు శాంసన్‌కు అవకాశం ఇస్తారా అన్న చర్చ మొదలైంది. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి మెరుగ్గా రాణించినప్పటికీ, మిగతా బౌలర్లు స్థిరత చూపకపోవడం సూపర్ 8లో సవాలుగా మారవచ్చు.

Sponsored