టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 53 పరుగులతో ఆకట్టుకోగా, తిలక్ వర్మ 19 బంతుల్లో 45 రన్స్ చేశారు. చివర్లో హార్దిక్ పాండ్య 10 బంతుల్లో 30 పరుగులు చేసి స్కోర్ను పెంచారు. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 210 పరుగులకే పరిమితమైంది.