రాఖీ

రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు..

Published on: 11-08-2025

రాఖీ పండగ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురంలోని వితంతు మహిళలకు చీరలను కానుకగా పంపించారు. సుమారుగా 1500 వితంతు మహిళలకు పవన్ కళ్యాణ్ తరుఫున స్థానిక జనసేన నేతలు చీరలను పంపిణీ చేశారు. భర్తలు దూరమైన మహిళలకు అన్నగా అండగా ఉంటాననే భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Sponsored