ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వచ్చే వారం న్యూఢిల్లీ లో ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ నాయకులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ సమావేశం గ్లోబల్ సౌత్లో జరుగుతున్న మొదటి అంతర్జాతీయ AI సమ్మిట్గా గుర్తింపు పొందింది. ఇందులో 15–20 దేశాధినేతలు, 50కిపైగా మంత్రులు, 40కు పైగా CEOలు పాల్గొని AI మరియు భవిష్యత్ టెక్నాలజీలపై చర్చలు జరపనున్నారు.