మాలీలోని (Mali) కోప్ట్రే ప్రాంతంలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్కు గురయ్యారు. విద్యుదీకరణ ప్రాజెక్టుల కోసం వారు స్థానికంగా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం నాడు కొందరు దుండగులు వారిపై దాడి చేసి, ఆ ఐదుగురిని అపహరించుకుని వెళ్ళిపోయారు. ఈ ఘటన తర్వాత, అదే కంపెనీలో పనిచేసే మిగతా భారతీయులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ కిడ్నాప్ను కంపెనీ ప్రతినిధులు ధృవీకరించారు, కానీ బాధితుల వివరాలను వెల్లడించలేదు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత వహించినట్లు ప్రకటించలేదు.